Second Part :
మొన్ననే భాగిరథి , అలకనంద కలిసి గంగ గా మారిన ప్రదేశం చూసాము . నిజంగానే గంగ ఒక నది మాత్రమే కాదు . ప్రకృతి యొక్క శక్తి .
ఆరతి కుమార్ తన రెండవ యాత్ర గా గంగ హూగ్లి దగ్గర ఎలా వుందో చూడాడానికి వెళ్ళారు .అందులో వరద లో వెళితే అక్కడ పరిస్థితి తెలుస్తుందని వెళితే -- మానవుడు ఎంతో తెలివిగా ఆ శక్తిని కట్టేసానని అనుకున్నది ఎంత అబద్ధమో తెలియజేస్తుంది ఆ ప్రదేశం .
ఫరక్కా బ్రిడ్జి . హేమచంద్ర ఎప్పుడూ చెపుతూ వుండేవారు . ఆ బ్రిడ్జి వస్తే అన్ని కష్టాలు తీరుతాయని భ్రమించారు . కాని గంగా ప్రవాహం లో వచ్చే 'సిల్ట్ ' ఆ బారేజికే ప్రమాదం . సముద్రం నీరు వెనక్కి రాకుండా చేసిన ప్రయత్నంతో బారేజి దగ్గర సిల్ట్ పెరిగింది . గంగ ఆ అడ్డం కి విసిగి తన రూటు మార్చుకుంది . ఇంకా గట్టిగా వరద వస్తే ఆ బారేజికే ప్రమాదం . ఆ రూటు మారడం వల్ల ఎన్నో ఊళ్ళు వరద కి దెబ్బ తిన్నాయి . అందులో కొంత భాగం ఝార్కండ్ . అయితే అక్కడ ఉండేవారు బెంగాల్ స్టేట్ . చివరికి వారు ఇక్కడ , అక్కడ లేరు . అక్కడికి స్కూల్ లేదు , కరెంట్ లేదు , హాస్పిటల్ లేదు . boundary నిర్ణయించేటప్పుడు గంగ ఒడ్డు అని రాసుకున్నారుట . ఇప్పుడు ఆ గంగ ఒడ్డు మారింది .
మనుష్యుల జీవితాలు ,ప్రకృతి తో అనుబంధాలు చూస్తే -- ఎందుకింత సంకుచితంగా ఆలోచిస్తామని అనుమానం వస్తుంది .
No comments:
Post a Comment