Thursday, October 20, 2022

random thoughts- Diary -1

 I do not like to pen down the thoughts. Reason 1. We change 2. It might not be true. 3. It might hurt someone. 4. It might become detrimental to me.

With so many fears, some my own and some injected with what's happening around me, I usually avoid penning my thoughts or record them. It is always a neutral subject. It can be either a book I read or a music concert I heard. Perhaps I fear being wrong . Worst part is being caught on the wrong foot. This, I think, I should look into or perhaps work on it.

But thanks to the podcasts I heard, the diaries of people , I decided to rant. Maybe I will change my mind. Maybe I am wrong. maybe I assume many things. But now I think it is a journey I make. So I need to be truthful. 

I made a loud resolution albeit to myself that I will write. I will write on things I like, things which I don't, things I aspire though late in life.

Today it is 21st of October 2022.

As I walk I listened to the interview of Alice Evans. Amit varma's podcast 'Seen and Unseen"seems to have opened many windows. It is interesting to see or to be more accurate listen to people from various walks of life, people who have done a lot of work. 

Today is the day of decision making. Saila decided to end the contract of Chezian. It is a tough decision. May be it will help in the long run. It is more challenging because now I have to step up my interaction with the work done at the site and cannot afford to be slow or laid back. At the same time it is challenging. 

With the erroneous habit of hanging on to the past, I still remember the resistance and pressure I faced when I decided to extend the existing A block shed. Fortunately it became useful for 30 long years. Now it is the main structure itself. The only difference is at that time it was a lone battle and now it is a team. Saila is a great asset. In fact she is the pillar on which we all depend. I feel sorry that her strength has made her a victim of  many people leaning on her for their financial. emotional needs. 

Today I plan to meet Amarnath Sankar. He is a part of the tumultuous years I passed through. Normally I don't like to look back or meet any of the old acquaintances. It is a kind of shutting down the old life. But it is there. It cannot vanish. So perhaps the time has come to meet this young man . 

Today Chimmi messaged asking about the three songs of  Rajani. I  do not know much about the songs. I also feel sad that we lost the tapes in which we recorded all the original tunes for almost 5 weekends or so. Perhaps it is not to be! Destiny had no plans of preserving them.

I decided to write. I decided to write about what I read, the movie I watched or journey I made. It is exciting!! Hope I will continue it and try to hone my skills. 


Tuesday, August 23, 2022

International Music Day Celebrations

  

 

                            International Music Day Celebrations

 

 

On June 21, 2022, Ghantasala Venkateswararao Government music college celebrated International Music day by hosting a Carnatic classical music concert by Vidwan Modumudi Sudhakar. Buchayacharyulu, the day's chief guest, gave a few insights into the principles of Carnatic music and the need to encourage the youth to respect, understand, learn and appreciate the greatness of classical music. Principal In charge Vishnubhotla Krishnaveni 

 

In continuation to the spirit of the day, Modumudi Sudhakar started his concert with a note that he would present the kritis, which explains the origins of music. He started his concert with a varnam 'Omkara Pranava nadodbhava' in Raga Shanmukha Priya, written by Dr.M.Balamurali Krishna. It explains the origin of nada from the body of 'Vatapatra sai' or Vishnu.

 

The concert was like a demonstration of the nuances and technicalities in Carnatic classical music. The next item was ‘Sobhillu Sapta swara sundaralu ‘in Raga Jaganmohini. Sudhakar explained the various methods of 'swara vinyasa,' or building the intricate patterns of the notes, which can enhance the beauty of the kriti and showcase the 'manodharma 'of the singer. He demonstrated the singing of short notes sung in one breath, Janta swara, long notes, etc. The presentation explained the extensive opportunity the singer has to present the beauty of the raga in layers carefully placed one above the other. The singers of Telugu Land have the advantage of singing in their mother tongue. Sudhakar pointed out this aspect and urged the artists to be clear in their pronunciation and enunciate to bring out the spirit of the lyricist. 

  The next item he chose was Syama Sastry's kriti 'karuna juuda ninnu nammina vaadu gada' in Sri raga. The fourth item was Deekshitar's 'anandamrutha karshini,' thus completing the three great masters of Carnatic music. It was followed by 'Nadatanumanisam.' 

Sudhakar explained The central theme in almost all the kritis in Carnatic music is 'Bhakti.' The three vaggeyakaras – Thyagaraja, Muttuswamy Deekshitar, and SyamaSastry,  the pillars of Carnatic music, have strengthened this in their voluminous works. The later generations have followed in their footsteps. The artist should present the emotion in his singing. The swara vinyasa, too, should not alienate from the emotion shown in the kriti. 

 

Sudhakar completed 50 years of the musical journey and sang in around 5000 concerts. One item he presents at every concert is "Sangeetha samrajya sancharini'. He presented the kriti as his prayer to the deity of music, Sri Sarada. His soulful presentation of these kritis enthralled the audience and enriched young learners. The audience appreciated his attempt to make the celebrations of International Music day more meaningful by explaining the greatness of Carnatic music and its place in the world of music. He was ably supported on violin by young Ambatipudi Kamakshi , a promising artist who won the hearts of the appreciation of the audience with her raga prastarana in Raga jaganmohini. Parupalli Subbaraya Phalgun accompanied on mridangam.

 

 

Sunday, May 1, 2022

రజని -- మరు నిముసమే !

 ఈ మధ్య వరుసగా వస్తున్న సంవత్సరీకాల వార్తలు కిందటి సంవత్సరపు బాధ అంతా గుర్తుకు వచ్చింది . ఇలాంటి వార్తలు విన్నప్పుడు నాకు గుర్తుకు వచ్చే పాట ఇది .

     ఈ పాట రజని గారి దేవదాసు నృత్య నాటకం లొనిది . నేను చాలా రోజులు అది చండిదాసు లోది అనుకున్నాను . ఎందుకలా ? అంటే మామయ్యగారి తో కబుర్లల్లో అదలా గుర్తు ఉంది . ఇవ్వాళ మళ్ళీ చూస్తే కాదని తేలిపోయింది . రజని గారికి ఇష్టమైన నాటకం చండీదాసు .

      దేవదాసు నాటకమైన సరే మనిషికి ప్రతీది నెగటివ్ గా చూస్తే అది అలాగే కనపడుతుంది . ప్రతీదీ పాజిటివ్ గా చూసే రజని గారికి దేవదాసు పాటలోని నిరుత్సాహం లో కూడా ఎందుకో ఆశ ఉంటుంది అని అనిపిస్తుంది .

ముందు పాట 

మరు నిముసము మనదో కాదో 

మదు వానవో మధుపా ! మధుపా !

వడ గాలిని వాడునో యేమో 

జడి వానను రాలునో యేమో !

తొంగలి రెప్పల చెంగల్వ పువ్వే 

తొంగి చూచె నదిగో  కన్నావే 

రేపనీ మాపని చూడకుమోయ్ 

రెప్ప పాటు మాత్రమే యీ బ్రదుకోయి !

ఇదీ పాట . ముందు వాక్యం తేలికగా అర్థం అవుతుంది . మధు వానవో -- అది తేనె వర్షం కాదు . ఆనవో అంటే తాగు , తాకు అనే అర్థం . 

మధు పా ! = భ్రమరం ! తేనేటీగ 

వడ గాలిలో -- ఎండ కాలపు వేడి గాలి 

తొంగలి -- వాలుట . చెంగల్వ పువ్వు మొగ్గ రెప్పలు వాలినట్లు ఉన్నాయని అర్థం .

అది అప్పుడే విచ్చుకుంటొంది అని అర్థం . కాని దాని కి మరు నిమిషం లో ఏమవుతుందో తెలియదు కదా ! అది వడగాలికి వాడ వచ్చు , జడి వానలో నేల రాలి పొవచ్చు . రెప్ప పాటు మాత్రమే ఈ బ్రతుకు . 

అందుకే రేపని , మాపని ఎదురు చూడవద్దు . మరు నిముసము మనదో కాదో ! 

దేవదాసు మానసిక స్థితి కి అద్దం పడుతుంది ఈ పాట . అంతే కాక జీవన సత్యం కూడా ఇందులో ఉంది . మనం గమనించవలసింది , ఈ పాట రాసింది 1940 లో . అంటే అప్పటికి రజని గారి వయసు 20 సంవత్సరాలు . 

ఇక రజనీ గారికి సాహిత్యము , సంగీతము వేరే కాదు . ఈ పాట లో ' తొంగలి రెప్పల ' అనే మాటల మధ్యలో చిన్న తీగ మీటు ఉంటుంది . అది ఆ రెప్పలు వాలడానికి సంకేతంగా వాడానని రజని గారు చెప్పేవారు . అది ఆ వయస్సులో . అయితే ఈ ప్రయోగాలన్నిటికి అప్పటి బెంగాలి సంగీతం ప్రభావం ఉందనే చెప్పాలి .

ఈ పాట లోని ఆ వేదాంతాన్ని  మనస్సులో ఉన్నది ఉన్నట్లు గొంతులో  పలికించారు వోలేటి గారు . ఆ మహామహులందరిని గుర్తు తెచ్చుకుంటూ ఈ పాట 

https://youtu.be/5iEPAo25LGI





Sunday, April 24, 2022

Emotions recollected in tranquility -8.

 నా కాశీ యాత్ర -8

ఇంక మిగిలింది అస్సీ ఘాట్ . అది చూడాలి అని మళ్ళీ పొద్దున్నే లేచి అయిదింటికల్లా అస్సీ ఘాట్ చేరాము . అసలు వీలైతే గంగా స్నానం , పెద్దలకు అర్ఘ్యం అనుకున్నాము . కాని అక్కడకి చేరే సరికి పొద్దున్న హరతికి సన్నాహాలు జరుగుతున్నాయి . ఒక సంస్థ వారు ( ఏ సంస్థో తెలియలేదు ) పిల్లలని తీసుకుని వచ్చారు . పొదున్నే ఆ ఘాట్ల మెట్ల మీద కూర్చుని పిల్లలు పాడిన స్త్రోత్రాలు విన్నాము . తెలి సంధ్య కాంతులు ఇంకా పూర్తిగా పట్టణాన్ని మేలుకొలపలేదు కాని ఘాట్ దగ్గర సందడే సందడి . 

ఒక గంట అక్కడ కూర్చుని స్నానానికి కేదార్ ఘాట్ వీలని దిలీప్ మాట మీద మళ్ళీ అటు వెళ్ళాము . అయితే భార్గవి మళ్ళీ ఆ మెట్లు దిగలేనంది . నిమ్మి మాత్రం ప్రసాద్ గారు వద్దులే అన్నా వెళ్ళింది . మేము కారులొనే కూర్చున్నాము . ప్రసాద్ గారు గంగా స్నానం చేసి , పోయిన వారందరి పేరు మీద పూజలు చేసారు . తెలుగు బ్రాహ్మణులు దొరకలేదండి , ఒక ఉత్తర భారతీయ పూజరి గారి నిర్వహణలో పూర్తి చేసాను అన్నారు . నిజానికి అది ఆయన 25 వ తారీకు , హేమచంద్ర పుట్టిన రోజు నాడు చెయ్యాలి అనుకున్నారు కాని అలా ముందు అనుకోలేదు కనుక కుదరలేదు . బహుశా నా మనస్సులో ఎక్కడొ రెండూ ఒక రోజు అని ఇష్ట పడ లేదేమో ?! మా స్నానానికని చిన్న బాటిల్స్ లో నీరు పట్టుకొచ్చారు . 

 మేము రూము కి వచ్చి 'గంగా ' స్నానం చేసాము . ఇక అక్కడ నుండి షాపింగ్ . ఆదివారం . ఒక్క షాప్ దొరికింది . పాపం ఆ షాపు లోని వ్యక్తి , మేము కాసేపు హిందీ లో కుస్తీ పట్టాక ఇంక లాభము లేదని తెలుగు వచ్చిన వ్యక్తిని పంపాడు . ఆయన విజయనగరం అన్నాడు . భార్గవి రాసినట్లు కడప దగ్గర విజయనగరం అయ్యి వుంటుంది . ఒక జీవిత సత్యం చెప్పాడు -" కాశీ విశ్వనాధుడు అక్కడ , బెజవాడ కనకదుర్గమ్మ ఇక్కడ దొరకరు ; మిగతావన్ని అన్ని చోట్ల దొరుకుతాయి . మీకు ఇక్కడేమి స్పెషల్ ఉండవు "అని . ఇంకెందుకూ అని రెండు బ్లౌజ్ ముక్కలు కొని , ఒక చీర తీసుకుని బయట పడ్డాము . 

ఇంక మిగిలింది రాం నగర్ ఫొర్ట్ . సరే నని మధ్యాహ్నం అటు వెళ్ళాము . అదీ పెద్ద కోట . కాశీ రాజు గారి నివాసం . ఇప్పటి కాశీ రాజు అక్కడ ఉంటారుట . బ్రిడ్జి దాటి వెళ్ళాలి . గంగ ఆవల ఒడ్డున ఉంది . బ్రిడ్జి నుంచి చూస్తే భలే అందంగా ఉంది . గంగ ఒడ్డు. వరద వచ్చిన మునగకుండా ఎత్తులో కట్టారు . ఇప్పటి రాజు పేరు అనంత్ నారయణ్ సింగ్ ట . ఈ కోట వారణాసి నుండి 14 కిలోమీటర్లు దూరం లో ఉంది . అయితే BHU కి దగ్గర . రెండు కిలోమీటర్లు . 

 ఇది ఒక భాగం ప్రదర్శకులకు వదిలారు . maintenance  ఏమీ బాగాలేదు. టికెట్ ఉంది కాని లోపలంతా దుమ్ము ధూళీ , ఏవీ వివరంగా లేవు . ఆ కోట చరిత్ర లేదు . అయితే ఈ కోట మరీ పాతది కాదు -1750 లోనే కట్టారుట . అయితే లోపల కోర్ట్ యార్డ్ బాగుంది . మాతో పాటు చూడాడనికి వచ్చిన ఒక విద్యార్థి ఆ maintenance  చూసి బాధ పడ్డాడు . తను అన్నాడు ఇంతకంటే చూడవల్సింది దీనికి దగ్గరలో ఉన్న వాటర్ ఫాల్స్ అని . వాటర్ ఫాల్ ? అదెక్కడా అని అడిగితే -- అయ్యో అది చూడలేదా ? చందౌలి అని వారణాసి కి 60 కి దూరంట . ఇంకా అయిదారు ఉన్నాయిట --60, 65 కి దూరంలో . అంత ఓపిక లేదు . 

బయటకు రాగానే దిలీప్ లస్సి laced with కోవా ఇచ్చాడు . భలే రుచిగా ఉంది . అంత తినాలంటే భయం పైగా తీపి అలవాటు తప్పింది . ఇష్టమున్న వారు మాత్రం మిస్ అవకూడదు . అక్కడే ఫొర్ట్ ముందు ఫొటొ అంటూ వెంటబడి డబ్బులు తీసుకుని -- పైగా మూడూ కాపిలు -- ఒక అలుక్కుపోయిన , భయంకరమైన ఫోటోలు కవర్లో పెట్టి ఇచ్చాడు . కారులోకి ఎక్కాక చూసుకున్నాము . అయినా పాపం మాలాంటి వాళ్ళు ఉంటేనే కదా వాళ్ళూ బతికేది ! 

  ఇక చివరి ప్రోగ్రాం ! అప్పటికే నాలుగు రోజులైంది . మల్లాది సూరిబాబు గారు ఆయన వ్యాసం లో దీక్షితుల వారు కాశీ లో శ్రీ చక్రం ప్రతిష్టించి దానిపై ఒక శివ లింగం ప్రతిష్టించారని విన్నాను . అక్కడ ఆయన ఒక ఆరు నెలలు ఉన్నారుట . ఆ తరువాతే గురువుగారి ఆదేశం పై సుబ్రహ్మణ్యు న్ని దర్శించుకుని ఉపాసన చెయ్యడం అంతా జరిగిందిట . అది చూడాలని ! అక్కడ ఎవరూ తెలియదు అన్నారు . భగవంతుడి లీలో ! కాకతాళీయమో ! పొద్దునే మల్లాది శ్రీ రాం ప్రసాద్ వేరే పని మీద ఫోన్ చేసారు . అప్పుడు ఈ గుడి గురించి అడిగాను . వెంటనే అక్కడ BHU లో ఉన్న మృదంగ విద్వాన్శునికి ఫోన్ చేసి , ఆ గుడి పూజారి గారిని కలిపారు . ఆయన రాం నగర్ ఫోర్ట్ నుంచి దగ్గర అని అటు దారి చెప్పారు . అది హనుమాన్ ఘాట్ దగ్గర ఉందిట . ఒక సందు వరకు వెళ్ళాక అక్కడి నుంచి నడవాలి . ఆయన శిష్యుని పంపి లోపలకి తీసుకు వెళ్ళారు . చిన్న గుడి . అందులొనే పూజరుల నివాసం . కాశీ లోని ఎన్ని వందల లింగాలలో ఒకటి కాని మనకి అది ముఖ్యం . అక్కడ భార్గవి దీక్షితార్ కృతి ఒకటి పాడింది . అక్కడనుండి తృప్తిగా బయట పడ్డాము . మర్నాడు ప్రయాణం . వారణాసి జిలేబి తెచ్చాడు దిలీప్ . అది ఎంతో రుచిగా ఉందిట . నేను తినలేదు .ఆ రాత్రి అందరం ఒకే రూము లో కలిసి కూర్చుని కబుర్లు చెప్పుకున్నాము . మర్నాడు ప్రయాణం ముందు మాకు వేడిగా జిలేబి , పాన్ కావలని అడిగాము . పొద్దున్నే అవి తీసుకుని దిలీప్ వచ్చాడు . మా అమ్మకి జిలేబి ఇష్టం , పాన్ ఇష్టం . నాకూ పాన్ ఇష్టం . బిల్స్ సెట్టిల్ చేసి మెల్లగా వెనక్కి బయలుదేరాము . అప్పుడు నిజంగా బెంగ అనిపించింది . ఈ నాలుగు రోజులు కాశీ లో స్నేహితులతో హాయిగా గడిచింది . 

విమానం టైముకి వచ్చింది . ఆ ప్రయాణం లోనే విమానం packed గా ఉండడం , మా పక్కన కూర్చున్న ఆయన వలన కలిగిన అసౌకర్యం వల్ల భార్గవి ఇబ్బంది పడింది . హైదరాబాద్ లో దిగగానే హమ్మయ్య అనుకున్నాము . ముందే బుక్ చేసుకున్న కార్ రావడం మేము ఇంటి ప్రయాణం మొదలు పెట్టాము. అప్పటికే రెండు దాటిందని చౌటప్పల్ దగ్గర విలేజ్ ఫూడ్ లో భోజనం చేసాము . ఎనిమిదింటికల్లా విజయవాడ  వచ్చేసాము . భార్గవి పామర్రు వెళ్ళి పోయింది .

ఇదండీ మా కాశీ యాత్ర . కింద నిమ్మి చెప్పినట్లు దిలీప్ నంబర్ కావలంటే ఇస్తాను . అతనికి తెలుగు రాదు . కొంచం ఇంగ్లీష్ వచ్చు . కాని మంచి వాడు . జాగ్రత్తగా అన్నీ చూపాడు . 

ఒక ప్రయాణం ఒక జీవితానుభవం . మన గురించి మనకు తెలియజేసే ఒక పాఠం ! కాశీ అందులో ఒక ప్రత్యేక అనుభవం .

స్వస్తి 

   


Emotions recollected in tranquility-8

 కాశీ యాత్ర -7

బుద్ధం శరణం గచ్చామి ! సంఘం శరణం గచ్చామి !

నాలుగు రోజులు తిరిగి ఇంత రాస్తున్నావేమి అని నవ్వుకుంటున్నారా ? ఏదో ఆలొచనలు పంచుకుందామని . 

   మధ్యాహ్నం నాలుగింటికి బయలుదేరి సార్నాథ్ వెళ్ళాము . సారనాధ్ , వారాణాశి కి ఏడు , ఎనిమిది కిలో మీటర్లు దూరం లో ఉంది . మన హైదరాబాద్ , సికిందిరాబాద్ లాగ . అరగబంట లొపే చేరాము . అక్కడ ఆర్కియాలజి మ్యూజియం , బౌద్ధ స్థూపాలు రెండు ఉన్నాయి . మ్యూజియం , సార నాధ్ స్తూపానికి అయిదింటికల్లా మూసేస్తారు అన్నారు .ముందు బౌద్ధ దేవాలయానికి వెళ్ళాము . నిజానికి దాని వెనకాల ఒక రిట్రీట్ సెంటర్ ఉందిట . అది తరువాత తెలిసింది . మా అబ్బాయి ఒక వారం రోజులు అందులో ఉన్నాడు . 

హిందూ మతమే కాక బౌద్ధానికీ కాశీ ముఖ్య మైన ప్రదేశము . బుద్ధుడు తన మొదటి తపస్సు ఈ అడవులలోనే చేసాడుట . ఆ రోజుల్లొ కాశీ పట్టణం చుట్టూ అడవులు , ఎన్నో చిన్న చిన్న మడుగులుతో ఎంతో ప్రశాంతం గా ఉండేదిట. ఇప్పుడు చూద్దామన్న ఏమీ లేవు . అలాంటి అడవిలో తపస్సు చేసి ఇది మార్గం కాదని వెళ్ళిన సిద్ధార్ధుడు , తనకు బోధి చెట్టు కింద జ్ఞానోదయం అయ్యాక ముందుగా తనకి తెలిసిన సత్యం తెలియజేయడానికి సారనాథ్ వచ్చి అక్కడ తన మొదటి భాషణ ఇచ్చారు . ఆ ప్రదేశం చూపిస్తారు . ఆ భాషణ విన్న ఆయనతో పాటు అంతకు ముందు తపస్సు చేసిన స్నేహితులు ఆయనకి ముందు శిష్యులయ్యారు . ఈ ప్రదేశాన్ని సంఘారామ అంటారు . మధ్యలో 60 మీటర్లు ఎత్తు విహారం వుంది . ఆ విహార కప్పు పైన బంగారు మామిమామఉంది  .మధ్యలో ఎత్తైన బుద్ధుని విగ్రహం ఉంది . ఆయన జ్ఞానం పొందిన బోధి చెట్టు కొమ్మ అక్కడ నుండి తెచ్చి ఇక్కడ పెట్టారుట . అది ఇంకా ఉంది . నిజానికి బోధ్ గయ లో అసలు చెట్టు పడిపొతే మళ్ళీ ఈ చెట్టు కొమ్మని అక్కడకు తీసుకుని వెళ్ళి పాతి పెట్టారుట . ఇప్పుడు బోధ్ గయ లో ఉన్నది ఆ చెట్టు . 

   మొదట భాషణ ఇచ్చిన ప్రదేశం లో ఒక స్తూప ఉంది . మన అశొక స్తూపనికి నమూన నాలుగు సింహాలు అక్కడ ఉంది . అలాగే బామియాన్ బుద్ధుని విగ్రహాలు ఆఫ్ఘనిస్తానులో తాలిబాన్లు పేల్చేసాక అదే నమూన తో థాయి లాండ్ ప్రభుత్వం తో కలిసి 80 అడుగుల విగ్రహం నిర్మించారు . ఇది చెయ్యడానికి 14 సంవత్సరాలు పట్టింది . బుద్ధ విగ్రహం ముందు ఆహ్లద కరంగా ఒక నీటి మడుగు కలువలు , తామరలతో ఉంది . వాటి ఎదురుగా మాయదేవి విగ్రహం ఉంది . ఆ ప్రదేశం అలా గబ గబా చూడాల్సిన ప్రదేశం కాదు . ఆ ప్రశాంతత కూర్చుని అనుభవించాలి . 

మ్య్యుజియం మూసేస్తారని అటు వెళ్ళాము . టికెట్టు తెచ్చుకోడానికే పది నిమిషాలు పట్టింది . బాగులు బయటే ఇచ్చేసి లొపలకి వెళ్ళాము . చాలా ఉంది చూడడానికి . గబ గబ నాలుగు గదులు చుట్టేసాము . ముందు ఆకర్షణ original నాలుగు సింహాల స్తూపం . చరిత్ర విద్యార్థులకి ఒక పండుగ . మళ్ళీ మూసేస్తారని అశోకా స్తూపానికి వెళ్ళాము . 

అక్కడ చాలా నడక ఉంది . పాపం అప్పటికే భార్గవికి , నిమ్మికి పాదాలు వాచి ఇబ్బంది పెడుతున్నాయి . వారిని అక్కడ కూర్చొమని నేను ప్రసాద్ గారు లోపలకి వెళ్ళాము . 

  అది ధమేక స్తూపం . మొదట క్రీ . పూ .249 లో అశొకడు కట్టించిన ఆ స్థూపానికి క్రీ . పూ .500 లో మొదటి కట్టిన స్థూపం మెరుగు పరచడమే అని ఆధారాలు చెపుతున్నాయి . అక్కడ ఒక మహా చైతన్యం ఉండేదిట . దాదాపు 1500 మంది బౌద్ధులు అక్కడ నివాస ముండేవారని విదేశీ యాత్రికుని xuanchang రాతలలో ఉంది . ఇప్పుడు ఆ అవశేషాలు ఉన్నాయి . ఎంత ప్రశాంతత ! ఆ స్థూపం పరిక్రమ చేస్తే -- ఇది ఎలా కట్టగలిగారా అని ఆశ్చర్యం కలుగుతుంది . అదీ అలా గబగబా చూడాల్సిన ప్రదేశం కాదు . అక్కడ ఒకామె బయట నిల్చుని అడిగారు -- ఏమండి ఆ స్థూపం లోపల ఏమైనా ఉందా ? మా గైడ్ అక్కడ ఏమి ఉండదు రాళ్ళు రప్పలు తప్ప అన్నాడు .నేను ' మన ఆసక్తిని బట్టీ ఉంటుంది . స్థూపం లో లోపల ఏమీ లేదు . వెళ్ళే మార్గమూ లేదు . అన్నాను . 

    ఇక టైం అయ్యిందని బయటకు వచ్చాము . కానీ మళ్ళీ వెళ్ళాలి . అప్పటికి అందరం అలిసిపోయి వెనక్కి వెళ్ళాము . 

Friday, April 22, 2022

Emotions recollected in tranquility-6

 కాశీ యాత్ర -౬

శంభో మహాదేవ ! హర హర శంకరా ! 

పొద్దున్నే నాలుగింటికి లేచి రెడీ అయ్యి నాలుగున్నరకల్లా విశ్వనాధ గుడికి చేరాము . ముందే దిలీప్ ఏర్పాటు చేసినట్లు ఒక షాప్ దగ్గర దింపాడు . గుడి కి దగ్గరగా ఉంది . అక్కడ మా బాగులు , ఫోనులు అన్నీ డిపాజిట్ చేసాము . లోపల పూజకు కావల్సిన పూల తట్ట ఇచ్చారు . టికెట్ కి ఒక వంద రూపాయులు కలిపి తీసుకున్నారు . అంటే మనం టికెట్ ఆన్ లైన్ లో తీసుకోవచ్చు . 350/- . అయితే అది ఒక రెండు రోజులు ముందే ఇస్తారు . మరీ ముందు దొరకవు , ఆలస్యంగానూ దొరకవు . మేము అది చెయ్యలేదు కనుక ఒక వంద రూపాయులు ఎక్కువ . ఇక అక్కడ నుంచి ఒక పుజారి కి అప్పజెప్పారు . ఆయనకి కొంచం తెలుగు వచ్చు . అన్నట్లు డబ్బులు ఉన్న పర్సు దగ్గర పెట్టుకోవాలి . ఇంక గుడిలోకి వెళ్ళిన దగ్గర నుండి ఆ పూజారి ' అమ్మా , కొంగులు కప్పుకొండి , మీ గొలుసులు లాగేస్తారు , పర్సులు జాగ్రత్తా ' అంటూ హెచ్చరిస్తూనే వున్నాడు . అదే తెలిసి వుంటే గొలుసులు లేకుండానే వెళ్ళే వాళ్ళం కదా అనుకున్నాము . పక్కన ఎవరు అన్న టెన్షన్ ఉండదు . 

ఇక అక్కడ ఉన్న మరో పూజారికి అప్పజెప్పాడు . అతను మీరు ఎన్ని లీటర్లు అభిషేకం ? ఒకటా ? అయిదా ? అని . నేను ఏమీ ఆలొచించకుండా అయిదు అన్నాను . అయిదు లీటర్లు పాలు . ఎక్కడో చదివాను -- ఆ శివుడికి పాల తో అభిషేకం చేస్తే మంచి గొంతు వచ్చి చక్కగా పాడగలుగుతారుట ! నాకు తీరని కోరికలలో అది ఒకటి . హాయిగా నాకు నచ్చేలా పాడుకోవడం . అందుకే ఏమి తడుముకోకుండా అయిదు అన్నాను . ఇవన్ని ఏక పక్ష నిర్ణయాలు . పక్కనే ఉన్న ప్రసాద్ గారిని , భార్గవిని అడగలేదు . పాపం , వారు ఏమీ మాట్లాడలేదు . పాలకి డబ్బులు . అక్కడ నుండి మొదలు -- అన్నీ అయిదు వందల కాగితాలే తీయడం , ఇవ్వడం .

గుడి చాలా బాగుంది . మోడి , యోగి గారి ప్రభుత్వ నేతృత్వం లో విశ్వనాధ కారిడార్ అని ఆ గుడిని విశాలం గా చేసారు . అంతకు ముందు ఒక సారి వచ్చిన ప్రసాద్ గారు చాలా మారిపోయింది అని చెప్పారు . అదీ కాలభైరవుని గుడిలాగా చిన్నదిగా ఉండేదిట . నేను చదివిన అన్ని పుస్తకాలలో అలాగే రాసి ఉంది . పక్కనే గోడ కి ఆనుకుని పెద్ద mosque ఉండేదిట . ఇప్పుడు ఆ మసీదుకి గుడి కీ దూరం ఉంది . విశాలంగా , తెల్లవారు జామున ప్రశాంతతో చాలా హాయిగా ఉంది . అప్పటికే జనం ఉన్నారు . అసలు లింగం పక్కన చిన్న మండపం లో నాలుగు లింగాలు వరుసగా ఉన్నాయి . అభిషేకం చేసేది వాటికి . ముందు కూర్చుని వారిది అయిపోగానే మేము కూర్చున్నాము . 

బకెట్ నిండా పాలు కలిపిన నీళ్ళూ , గంధం , తేనే , విభూది , ఇలా అన్ని చిన్న పాత్రలతో పట్టుకు వచ్చి అభిషేకం చెయ్యించారు . చాలా తృప్తిగా అనిపించింది . నాకైతే అదే విశ్వనాధుడు ! అసలు మూల విరాట్టు దూరం నుంచి చూడడమే కదా ! ఈయనకే విశ్వనాధుడని మనసార నమస్కారం చేసుకున్నాము . అక్కడి వారు చిన్న చెంబులలో నీరు తెచ్చి అలా కొంచం ఆ నాలుగు లింగాల మీద పోసి హర హరా అనుకుంటూ వెళ్తూ ఉంటే ఆ దేవాలయం అంతా విశ్వనాధుడే .పూజ అవగానే మాకు చేతికి కాశీ దారం కట్టాడు . కాశీ దారం మాకు తెలిసి నల్లగా ఉంటుంది కదా ! ఈయన ఎర్ర దారం కట్టాడు . రూల్స్ మారి పోయాయేమో !


అక్కడ నుంచి విశ్వనాధ దర్శనం . ఇక్కడ మాకు పక్క నుంచి క్యూ లో కలిపి పంపారు . ఇదేదో మా మీద అభిమానం కాదండి . ఒక్కో గ్రూప్ కి ఇంత టైం అని పెట్టుకుంటారు . ఆ టైం లో గబాగబా చూపించి బయటకు తీసుకుని వెళ్తేనే వారికి ఉపయోగం . వారి నెట్ వర్క్ అక్కడున్న పూజారులతోను , పోలీసులతోనూ ఉంటుంది . అదే వారి సంపాదన మార్గం .

  దర్శనం చేసుకుని ఆ పక్కకు వెళితే వినాయకుడు . మమ్మల్ని లోపలకి తీసుకుని వెళ్ళిన పూజారికి ఒకటే మంత్రం వచ్చు . ( అని మేము అనుకున్నాము ). అది చదివి వినాయకుడి దణ్ణం పెట్టించి అక్కడ తీర్థం తీసుకోని ఆ బ్రాహ్మడుకి వంద రూపాయులు ఇమ్మన్నాడు .

అక్కడ ఒక బావి ఉంది . ముందు ఉన్న లింగం ఔరంగ జేబ్ దాడి చేసి నప్పుడు ఒక పూజారి అది బావి లో పడేసారుట . అది లుప్త మయిపోయింది . అక్కడ నంది అటు వేపు తిరిగి వుంటాడు . ఎందుకంటే పూర్వమున్న లింగం అక్కడ ఉండేది . ఇప్పుడు అక్కడ ఒక మసీదు ఉంది . 

నిజానికి ఈ గుడి చాలా సార్లు దాడికి గురి అయ్యింది . 1194 లో కుతుబుద్దిన్ ఐబక్ , నాశనం చేసిన గుడిని Iltutmush కాలంలో ఒక గుజరాతి వర్తకుడు తిరిగి కట్టారు . మళ్ళీ శికందర్ లోడి దాడి చేసారు . 1585 లో రాజ్ మాన్ సింగ్ అది ముందు ఉన్న ప్రదేశం లో కడితే పూజారులు అందులోకి వెళ్ళడానికి ఒప్పుకోలేదుట . ఎందుకంటే మాన్ సింగ్ కూతురు ఒక ముస్లిం ని పెళ్ళి చేసుకుందని . మళ్ళీజహంగీర్ కాలంలో తిరిగి కట్టారు . 1669 లొ ఔరంగ జేబ్ గ్యాన్ వాపి మసీదు కట్టడం తో మరో సారి దాడికి గురి అయ్యింది . అప్పుడే ఆ లింగాన్ని బావిలో పడేయడం . 

ఇప్పుడు ఉన్న గుడి తరువాత ఇండోర్ మహారాణి అహల్యాబాయి హోల్కర్  1780 లో కట్టించారు .ఆ శివ లింగం కూడా ఇండోర్ నుండి తెచ్చారుట . భారత దేశం లోని చిన్నా , పెద్దా రాజులు అందరూ ఈ గుడి కోసం విరాళాలు ఇచ్చారుట .

కాని మనకి ఆ శివుడు ఎప్పటినుండో ఉన్న ఆది శంకరుడే . ఆ భావనే దాన్ని జ్యోతిర్లింగం చేసింది . 

 అక్కడ నుండి వెనక వైపుగా విశాలాక్షి గుడికి తీసుకుని వెళ్ళాడు . మీరు బయటకు వెళ్ళి ఈ గుడికి రావలంటే అరగంట పడుతుంది అని వారికే తెలిసిన సందుల్లో నుంచి తీసుకుని వెళ్ళాడు . 

మనకు దక్షిణ భారతం లో అయ్య వారికి ఎంత ప్రాముఖ్యత ఉందో అమ్మ వారికి ఒక ఆకు ఎక్కువే ! అమ్మలగన్న అమ్మ కదా ! ఇక్కడ అలా కాదు . అదో చిన్న ఇల్లు లా ఉంది . పాత కాలం చువ్వలుండే తలుపులున్న ఇల్లు . లోపలకి వెళితే అమ్మ వారు . మా పేరు మీద పూజ చెయ్యించి జాకెట్టు ముక్కలు , గాజులు ఇప్పించాడు . 

  అక్కడ నుండి చక చకా నడిపించుకుంటూ అన్న పూర్ణ దేవాలయం కి వెళ్ళాము . కాశీ అన్నపూర్ణ ! దణ్ణం పెట్టుకుని బియ్యం ప్రసాదం తీసుకున్నాము . నిజానికి అక్కడ ఒక పూట భో జనం అనుకున్నాము కాని మళ్ళీ అక్కడకి రావడం కష్టం అని అర్థం అయ్యింది . రమా శాండిల్యా గారు అన్నట్లు ఆ పక్కన ఉన్న లాడ్జీలలో ఉంటేనే అది సాధ్యం . ప్రాప్తం లేదు .

అన్ని చూసి బయటకు వచ్చి తిరిగి ఆ షాప్ కివచ్చి టైం చూసుకుంటే ఏడు . అప్పటికి గుడి దగ్గర జనం కూడా ఎక్కువ అయ్యారు .మమ్మల్ని లోపలకు తీసుకుని వెళ్ళిన పూజరి 10000/- నుండి మొదలు పెట్టి 2500/- సరి పెట్టుకుని వెళ్ళాడు . అక్కడ ఒక చిన్న శివలింగం కొన్నాను . మాకు తెలిసిన వారు అడిగారు . ఇంకా ఏమైనా కొందామని అన్నా అన్ని స్పెన్సర్ రేట్లు . దిలీప్ అప్పటికి ఆ పూజరితో గొడవ పడ్డాడు . వాళ్ళు ఇచ్చింది తీసుకోవాలి కాని అలా డిమాండ్ చెయ్యడమేమిటి అని . అతనంతే ప్రశాంతంగా నా సంపాదన ఇదే కదా అంటు వేరే పార్టిని గుడికి తీసుకుని వెళ్ళే ప్రయత్నం లో పడ్డాడు . 

మేము మెల్లగా బయట పడ్డాము . అక్కడే ఆ కారు దిగుతూ ఉంటేనే నిమ్మి కాలు మెలి దిరిగి స్ప్రైన్ అయ్యింది . తను ఏమి చెప్ప లేదు . తరువాత దాని ప్రభావం తెలిసింది . రూం కి చేరే సరికి పాదం వాచింది . 

మళ్ళీ హోటల్ కి చేరి కాస్త తిని రెస్టు తీసుకుని షాపింగ్ కి వెళ్ళాము . అదే ఆ పొద్దు సరిపోయింది . సాయం కాలం నాలిగింటికి సారనాధ్ అనుకున్నాము . ఈ లోపు ఇక్కడి భోజనం చెయ్యాలని అనుకున్నాము . చిన వీరభద్రుడి గారి పుస్తకం లో రాసారు - బాటి చోకా కి వెళ్ళాము . కింద కూర్చో గలిగే వారికి కిందా లేదంటే కుర్చీలు వేస్తారు , విస్తరాకులో భోజనం , చోకా అంటే మన బోండాం లా ఉంది . దానితో వంకాయ బజ్జి , పల్చటి పప్పు , గట్టి పెరుగు , పుదినా పచ్చడితో అన్నం . దానితో ఖీర్ . భోజనం బాగుంది . ఒకటి కంటే ఎక్కువ తినలేము . ambience చాలా బాగుంది . జనం అలా వస్తూనే ఉన్నారు . అది తిని ప్రసాద్ గారు తెచ్చిన బనారస్ పాన్ వేసుకుని రూం చేరాము . 

రజనీ ఒక నివాళి

 పొద్దున్నుంచి పరంపరగా వస్తున్న నివాళులు మనస్సు కి తృప్తి నిచ్చాయి . రజని గారు పోయి ఇవ్వాళ్టికి నాలుగు సంవత్సరాలు .

 అఫ్సర్ గారు తన నివాళి లో రాసినట్లు భావ గీతాల తుఫాను లో కూడా తన స్వరం వినిపించగలిగారు రజని . అతి పిన్న వయస్సు నుండి పాటలు రాసారు రజని . అవి వుత్తి మాటల మాలలు కాదు . భావాల లోతులున్నాయి . ప్రతి భావాన్ని ఒక చిత్రం లా మన ముందు ఉంచారు . ఈ దృశ్యం ఆయన్ని కదలించింది అని పక్కన ఉన్న మనకు తెలియదు , పాటైతే తప్ప . 

మధ్యలో ఆయన పూషా పేరుతో రాసిన కవితలు చాలా వేరుగా వుంటాయి . నేను అడిగాను -- మీరు ఇలాగే రాసి వుంటే ఈ తరానికి ఇంకా ఎక్కువ మందికి తెలిసే వారేమో ! అని . ఆయన అది నా స్వభావానికి సరిపోదు . నేనూ రాయగలను అని నాకు నేను చెప్పుకోవడానికే . అందుకే మానేసాను అన్నారు . 

ఇక ఆయన స్ఫృశించని పాటల ప్రక్రియ లేదు . లాలి పాటలు , చిన్న పిల్లల పాటలు , నృత్య గీతాలు , సినిమా గీతాలు , అనువాదాలు లలిత సంగీతం అన్నీ ప్రక్రియలలో తనదైన ముద్ర వేసారు . కాని అన్నిటి కంటే నాటకీయత పాటలలో ఆయనకి ఎక్కువ ఇష్టమేమో అనిపిస్తుంది .నృత్య గీతాలు , కూచిపూడి నృత్య నాటకాలు ఆయనకి చాలా ఇష్టమైన ప్రక్రియ. ఆయన వాద్య బృందాలలో కూడా కనిపించేది అదే . అది ఆది కావ్యావతరణ అయినా ,మాటలతో పాటలతో పిల్లల కోసం రాసిన కొండ నుండి కడలి దాకా అయినా , సంస్కృతం లో రాసిన మేఘ సందేశం అయినా అదే నాటకీయత కనపడుతుంది .అంతెందుకు -- ఒహో ఒహో ప్రతి శ్రుతి అనే పాటలో ' ఒంటరైన బాటసారి ఓ యన ఒహొ యన ' అదే నాటకీయత కనపడుతుంది . పద చిత్రాలు , నాటకీయత , సంగీతం ఆయన పాటని మళ్ళీ మళ్ళీ వినేలా చేస్తాయి . 

 రజనీ ఛాందసులు కాదు . అలా అని మన సంస్కృతి మీద అపారమైన ప్రేమ ఉన్నవారు . దేముడి మీద భక్తి ఉంది . ఏ మాత్రమూ భయం లేదు . అందుకే పూజ చెయ్యక పొతే ఎలా అని ఒక ritual కి కట్టుబడరు . శ్రీ కృష్ణం శరణం మమ రాస్తున్నప్పుడు ఆయన భగవద్గీత ఎలా పాటలో పెడతారా చూడాలని చాలా ఆసక్తి ఉండేది . ఆయన అవి రాసిన పది రోజులు శ్రీ కృష్ణ నామం జపం చేసారు , స్నానం చేసి , మంచం మీద కూర్చుని తన మనస్సంతా ఆ రూపం పై లగ్నం చేసారు . మనం చూస్తే కూర్చుని నిద్ర పోతున్నరని అనుకుంటాము . వచ్చిన వారితో మాములుగా మాట్లాడేవారు . అది రాయడం అయి పోయాక నేను ఎలా సాధ్య పడింది అంటే పై విషయం చెప్పారు . అయితే సంగీతం ఆయనది కాదు , నృత్యం గీతం కనుక ఆ భగవద్ గీత లోని అందం , సంపూర్ణత్వం మనకి విడిగా తెలియదు .

ఆయన పాట మాట వేరుగా రావు . అందుకే ఆయన సాహిత్యానికి ఆయన సంగీతమే మాకు నచ్చుతుంది . అలా అని అది ఆయన సొంతం అనుకోరు . ఉదాహరణకు రావు బాలసరస్వతి గారు పాడిన ' విరహానలంపు బాధ అది వారి ట్యూన్ . నాకు ఇదారి ట్యూన్ వినే మహదవకాశం దొరికింది . అది ఇక మళ్ళీ ఎవరికీ , ఎప్పుడూ సాధ్యపడదేమో . అప్పుడు ఈ స్మార్ట్ ఫోనులు లేవు , వరే పరికరాలూ లేవు . ఇక సూరి బాబు గారు చేసిన ' హాయిలో నేల ఎద కింత హింసా ' . నేను వారిని వారి ట్యూన్ అడిగాను . ఇది విన్నాక అది మర్చి పోయాను అన్నారు . సుధాకర్ గరు చేసిన నును మంచు సోనలో ' ఇవన్ని చాలా బాగుంటాయి . అది రజనీ గారు విని సంతోషించేవారే కాని నాపాట నా బాణి అని అనుకునే వారు కాదు . మరో మధురమైన పాట ' పృధయా సాంధ్య సమీర లాస్యం ' మంచాల జగన్నాధ రావు గారి  సంగీతం , పి. బి. శ్రీనివాస్ గారి గొంతులో ! ఎన్ని పాటలో ఎన్ని పాటలో చాలా పాటలు నాకు తెలియనవి వున్నాయి . ఎవరైన చెపితే విని చాలా సంతోషిస్తాను . ఆయన 17-18 ఏట మొదలు పెట్టి దాదాపు 80 ల దాక రాసారు . ఎన్ని పాటలు ఉండి వుంటాయి ! 

వారి సున్నితమైన పరిశీలన శక్తి , కొత్తదనాన్ని ఆహ్వానించడం , ఒప్పుకోవడం , ఆనిందచడం , అందరిని ఒకేలా చూడడం ఆయన్ని ఒక మహా మనీషిని చేసాయి . ఏదైనా విషయం గురించి మాట్లాడుతూ వుంటే అది అప్పుడు ఆయన బుర్రలో తిరుగుతున్న విషయం . దాని గురించి ఒక కొలిక్కి వచ్చేదాక అదే మాట్లడాతారు . ఆయన్ని దాని ఒప్పుకోమని కాదు, మన తో చర్చిస్తున్నారు . అందులో లోపం వుంది అంటే సర్దుకుంటారు . అలా చెప్పాలి అంటే భట్టు గారో V.A.K . రంగారావు గారో అయ్యి  వుండాలి . ఆయనకి  చివరిలో  కలిగిన  అసంతృప్తులలో అది ఒకటి . ఆయన భాష అర్థం చేసుకునే వారే తగ్గి పోయారు . రవి కృష్ణ గారు వచ్చి మాట్లాడితే ఆయన గొంతులో ఆనందం . పరచూరి శ్రీనివాస్ గారంటే విపరీతమైన అభిమానం . పారనంది గారంటే ఎంతో ఇష్టం . ఆయన ఎవరి నిస్కృమణ అయినా సమదృష్టి తో స్వీకరించారు . నేను ముగ్గురు వ్యక్తులు పోయినప్పుడు ఏడవడం చూసాను - మా అత్తగారు , అంతకు ముందు ఉషశ్రీ గారు , ఆ తరువాత బాలమురళి గారు. ఆ రోజంతా ఆయన్ని వదిలి పెట్టలేదు . నాకు ఆయన గురించి తెలిసింది చాలా తక్కువ  . ఆయన మీద భక్తే తప్ప విషయ పరిజ్ఞానం లేదు . అయినా చెప్ప వల్సింది చాలా వుంది అనిపిస్తోంది . ఆయన మాకు ఇచ్చిన ఆస్తే ఆయన కృషి వల్ల సంపాదించిన పేరు ప్రతిష్టలు . అవి ఎక్జడకు వెళ్ళినా మాకుదీవెనెలు గా వుంటాయి . 

Emotions recollected in tranquility-5

 కాశీ యాత్ర -5 

మచలతీ హుయీ హవా మే చంచం 

హమారే సంగ్ సంగ్ చలే గంగా కి లెహరే .

జమానే సే కహో అకెలే నహి హం 

హమారే సంగ్ సంగ్ చలే గంగా కి లెహరే .

గంగ మన జీవితం లో ఒక ముఖ్య భాగం . గంగ గోదావారి ని కూడా చూసాము మా కృష్ణ గంగ తో పాటు . ఇప్పుడు నిజంగా గంగని చూస్తున్నాము . ఆ ఉత్సాహంతో బయలు దేరాము . అసలు కాశీ లో దిగిన దగ్గరనుండి భార్గవి గంగ అంటూనే ఉంది . ఈ సారి ఏమనుకున్నాడో ఏమో దిలిప్ మాతో వచ్చాడు . ఆయన రాకపొతే దారి కనుక్కోవచ్చు కాని కొంచం కంగారుగా ఉండేది . మమ్మల్ని కేదార్ ఘాట్ కి తీసుకుని వెళ్ళాడు . చిన్న సందుల్లోంచి నడిచి వెళ్ళాము . ఒక చోట ఎవరింటి వాకిట్లోకో వెడుతున్నట్టు చిన్న నడవా . అందులో కొంతమంది సాధు వేష ధారులు పక్కలు పరుచుకుని పడుకుని ఉన్నారు . వారి ప్రపంచం వారిది . పక్కన నడుస్తున్న వారికేసి కూడా చూడటం లేదు . వారికున్న కొద్ది పాటి వస్తువులు మూటలు గా కట్టి కనపడుతున్నాయి . అవి దాటి ముందుకు వెడితే గంగ . అయితే గంగ ని చేరడానికి బోలేడు మెట్లు . అవి కూడా బాగా ఎత్తు . అది చూడగానే నిమ్మి , భార్గవి నీరసపడ్డారు . ఇద్దరికి కాళ్ళు నొప్పులు . ముఖ్యంగా మోకాలు . సరే తప్పదుగా మెల్లగా వెళ్దామని ఒకరికొకరం సాయం చేసుకుంటూ దిగాము . దిగే ముందు దీపాలు , పూలు ఉన్న చిన్న తట్టలు అమ్ముతున్నారు తల్లీ పిల్లలు . మమ్మల్ని చూడగానే తెలుగులో మాట్లాడడం మొదలు పెట్టారు . ముందు నేను వీరికి ఎట్లా తెలిసిందా అనుకున్నాను . తరువాత అనిపించింది -- మేము ఒకరితోఒకరం తెలుగులో కదా మాట్లాడుతుంటా అని . సరే అవి కొనుక్కుని మెల్లగా మెట్లు దిగి నావ మాట్లాడే పని దిలీప్ కి అప్పగించాము . 

అక్కడ మాములు సరంగులు నడిపే నావలు , మోటారు బోట్లు , luxury boats కూడా ఉన్నాయి . మనకి విడిగా మాట్లాడుకోవచ్చు , లేదా common పడవలు కూడా ఉన్నాయి . మేము మా వరుకే అని మాట్లాడుకున్నాము . మాములు పడవ అని నేనే అనేసాను . నాకు ఆ పడవ నడుపుతూ ఉండే తెడ్డు చప్పుడు బాగుంటుంది . నిదానం గా వెళ్ళచ్చు , మోటార్ శబ్దం ఉండదు అని ఉద్దేశం . బేరమాడి అక్కడనుండి మణికర్ణికా ఘాట్ దాక తీసుకుని వెళ్ళేటట్లు , ఆరతి చూపించేటట్లు బేరమాడుకుని బయలుదేరాము . మన మనస్సే అన్ని అనుభూతులకి మూలం కదా ! ఇన్నాళ్ళు విని విని ఉన్న గంగా నదిలో వెళ్తున్నాము అనే వాస్తవం ఆనందానిచ్చింది. 

  గంగా నదీ తీరం అంతా 80 ఘాట్లు దాకా ఉన్నాయిట . అందులో రాణీ ఘాట్ , ఇండొర్ రాణి గారు కట్టించింది , రాజ మాన్ సింఘ్ ఘాట్ ఉన్నాయి . మీరబాయి ఘాట్ దగ్గర ఆమె విధవ స్త్రీల కొరకు ఒక ఆశ్రమము కట్టించిందిట . ఇప్పుడు ఆ ఆశ్రమమూ మారి పోయింది . నారద ఘాట్ లో ఎవరూ జంట గా వచ్చి స్నానం చెయ్యరుట .ఆ జంట అనదమ్ములైనా , తండ్రి కొడుకులైనా , స్నేహితులైనా గొడవలు పడి విడి పోతారుట . నారదుడు కలహ ప్రియుడు కదా ! 

ఇక హరిశ్చంద్ర ఘాట్ అందరికి తెలుసు . ఎక్కువుగా శవ దహనం జరిగే ఘాట్ . దశాశ్వమేధా ఘాట్ . ఇక్కడే ప్రతి రోజు గంగా ఆరతి జరుగుతుంది . మున్షీ ప్రేమచంద్ ఘాట్ . కాశీ వాసులు ఆయన్ని ఎంతలా గౌరవించారో తెలిసి ఆనందించాను . ఆ ఘాట్ లో నే మెట్ల మీద కూర్చునే వారుట , అక్కడే రాసుకునే వారుట . అందుకని ఆ ఘాట్ కి ఆయన పేరు . అలా ఒక్కో ఘాట్ చూపించుకుంటూ మణి కర్ణికా చేరాము . ఎంత వద్దు అనుకున్నా వేదాంతం కలుగుతుంది . 360 రోజులు, 24 గంటలు ఎవరిదో ఒకరిది దహనం జరుగుతూనే ఉంటుంది . కాశీ మహా స్మశానం . కాశి జీవన క్షేత్రం. జీవితాన్ని , మృత్యువుని ఒకేలా చూడగలిగే శక్తి నిచ్చే క్షేత్రం ! ఇక్కడకు వచ్చాక హాయిగా పొతే పుణ్యం అనుకుంటూ మరణాన్ని కూడా భయపడకుండా ఆహ్వానించగలిగే ఊరు . అది నిజమా ? మనం కలిపించుకునే ఊహా ? అంటే ఊహే కదా వాస్తవం అయ్యేది . ఇక్కడ యమధర్మ రాజు కాదు మృత్యువుని ప్రసాదించేది , సాక్షాత్తు ఆ పరమ శివుడు . 

మణికర్ణిక నుండి దేవాలయానికి ఒక పెద్ద రాంప్ , మంచి తోవ తయారవుతోంది . గంగ లో స్నానం చేసి , ఎంత ముసలి వారైనా , మెల్లగా ఆ విశ్వనాధ దర్శనం చేసుకోవచ్చు . మేము వెళ్ళినప్పుడు మణికర్ణికా లో ఏడు శవ దహనాలు జరుగుతున్నాయి . అర్థరాత్రి 12 తరువాత శవం , అది ఎవరిదైనా సరే , బూడిద స్వామి కి తీసుకుని వెళ్ళి అభిషేకిస్తారుట ! హరిశ్చంద్ర ఘాట్ లో రెండో , మూడో ఉన్నాయి . ఇది వరకు చదివినట్లు సగం కాలిన శవాలు , మురికి -- ఇవి లేవు . గంగ శుభ్రంగా ఉంది . అయితే నీరు మంచిదేనా అంటే చెప్పలేము . కలుషితాలు , ముఖ్యంగా tanneries లో ని రసాయనక కలుషితాలు ఇప్పటి కీ కలుస్తూనే ఉన్నాయి .

అందుకే గంగ నీరు నెత్తి మీద జల్లుకోవడమే . ఇక అక్కడ నుంచి మెల్లగా వెనక్కి దశశ్వమేధ దగ్గరకు వచ్చేసరికి వలయాలుగా పడవలు . వాటి మధ్యలో మాదీ చేర్చాడు . మనకి భయంగా ఉంటుంది కాని వారు అలవాటుగా ఒకే టీం లా ఒక దాన్ని ఆనించి ఒకటి పెట్టారు . కొంచం సేపు భయం కలిగినా తరువాత వారి ధైర్యం మాకు ధైర్యం వచ్చింది . ఇంక విన్యాసాలతో ఆ సాయం సంధ్య గంగా ఆరతి చూడడం ఒక అనుభవం . అది చివరికి వచ్చాక మేము కూడా దీపాలు వెలిగించి గంగ లో వదిలాము . అంతా చూసి మెల్లగా కేదార్ ఘాట్ చేరాము . మళ్ళీ ఆ మెట్లు . ఆ పైన కేదారేశ్వరుని గుడి . అక్కడ కొంత మంది భక్తులు భజనలు చేస్తున్నారు . అది చూసుకుని మెల్లగా బయట పడ్డాము . అక్కడ ఒక లెమన్ టీ తాగాము . కొంచం మసాల కలిపి వేడిగా ఉన్న టీ భలే రుచిగా ఉంది . కాశీ లో జనం అంటే అక్కడే చూసాము . గుద్దుకోకుండా బళ్ళు ఎలా వెడుతున్నాయో నాకైతే అర్థం కాలేదు . ఇక ఎన్ని రకాల మనుష్యులో ! ఎన్ని భాషలు వినపడుతున్నాయో ! సౌత్ నుంచి చాలా మంది వచ్చారు ఈ నాలుగు రోజుల్లో అని సమాచారం అందించాడు దిలీప్ . అందరూ మా లాగా నాలుగు రోజులు ఉందామని వచ్చిన వారే కదా ! 

హోటల్ కి చేరి మర్నాడు పొద్దున్నే నాలిగింటికి విశ్వనాధ దర్శనం అని అనుకున్నాము . మా అబ్బాయి ఒక్క రోజులు ఇన్ని చూసారా ? అసలు కారు దిగారా ? అందులో నుంచే చూసి అయ్యింది అనేసుకుంటున్నారా అని వేళాకోళం చేసాడు . కాని మేము ఎంతో తాపిగా , హడావిడి లేకుండా చూసాము . 

Wednesday, April 20, 2022

Emotions recollected in tranquility-4

 కాశీ యాత్ర -4 

తొమ్మిదీ తొమ్మిదిన్నరకి బయలుదేరిన మేము ముందు తులసీదాస్ మానస మందిర్ కి వెళ్ళాము . ఇక్కడ స్థల పురాణం ఏమిటంటే పదహారో శతాబ్దం లో తులసీదాస్ ఇక్కడ తన రామచరిత మానస్ రాసారని . అందుకే మందిరానికి ఆ పేరు . అయితే ఈ మందిరం 1964 లో కట్టారుట . పూర్తిగా పాలారాయి తో కట్టబడి ఉంది . గోడల మీద రామచరిత మానస్ చెక్కబడి ఉంది . లోపల హనుమత్ లక్ష్మణ సీతా సమేత రామచంద్ర మూర్తి ఉన్నారు . పైన పురాణాలలోని కొన్ని ఘట్టాలు బొమ్మలు ఉన్నాయి . దానికి టికెట్ . లోపల తులసి దాస్ విగ్రహం కూడా ఉంది . మన దక్షిణ భారతం లోని విగ్రహాలకి ఉత్తర భారతం లో విగ్రహాలకి చాలా తేడా . 

జనం లేరు . పది పదిహేను నిమిషాల లో బయట పడి సంకట విమోచన హనుమాన్ మందిరం కి బయలుదేరాము . ఇది తులసిదాసు కట్టారని ప్రతీతి . ఇక్కడ హనుమంతునికి దణ్ణం పెట్టుకుని ఆయన రామచరిత మానస్ మొదలు పెట్టారుట . ఇక్కడ ఒక వైపు రామ లక్ష్మణుల గుడి , ఎదురుగా ఈ హనుమంతుని గుడి . టికెట్లు లేవు కాని బాగా చెకింగ్ జరిగింది . లోపలికి ఏది తీసుకుని వెళ్ళనివ్వరు . దీనికి కారణం 2006 లో జరిగిన బాంబ్ పేలుడు . అదృష్టవశాత్తు ఎక్కువ ప్రాణ నష్టం జరగలేదు . మర్నాటి నుండి మాములుగా భక్తులు వచ్చేసారు . అక్కడవారు ఇక్కడ బాంబ్ పేలలేదు ముందుగానే కనుక్కున్నారు అన్నారు . అక్కడ క్య్యులో దర్శనం చేసుకుని అక్కడ పూజరిని ఈ విగ్రహం గురించి తెలుసుకోవల్సింది ఏమైనా ఉందా అని అడిగితే ఇది స్వయం భూ . నీకైదైనా కోరిక ఉంటే వెళ్ళి అడుగు స్వామి తీరుస్తాడు అన్నాడు . ఏ కోరిక లేక పోతే అంటే ' నీకేమి అవసరమో అది ఇస్తాడు ' అన్నాడు . ఇంతలో అక్కడికి వచ్చిన ఒక భక్తుడు , వయస్సులో 25-30 వుంటాయి -" ఆంటిజీ , మీరు ఎక్కడో నుంచి వచ్చినట్లు తెలుస్తోంది . ఆ స్వామి పిలవకపోతే మీరు ఆయన్ని చూడలేరు . అది నా స్వానుభవం ' అని ఎంతో భక్తి గా చెప్పాడు . పూజారి గారు ప్రసాదం ఇచ్చారు . అక్కడ కోరికలు తీరడానికి నూలు తాడు అక్కడ ఉన్న చెట్టుకి కట్టి ఉన్నాయి ( పురికోస). చాలా మంది అక్కడ కూర్చుని చాలీస చదువుతున్నారు .అటునుంచి రాములు వారి దర్శనం చేసుకుని మళ్ళీ క్యూలో నిల్చోని ఇంకో సారి స్వామి దర్శనం చేసుకుని బయట పడ్డాము . అక్కడ నుండి BHU దగ్గరని అటు వెళ్ళి అక్కడ ఉన్న బిర్లా మందిర్ , కాశీ విశ్వేశ్వరాలయం కి వెళ్ళాము . 

ఆ ఆలయం విశాలంగా అందంగా ఉంది . మనం లోపలికి వెళ్ళి లింగాన్ని ముట్టుకోవచ్చు . అక్కడ ఆ ఆలయం ఎదురుగా మదన మోహాన్ మాలవ్య విగ్రహం ఉంది . ఆ విశ్వ విద్యాలయం అంతా ఆయన ప్రేరణ . యూనివెర్సిటీ బయట కూడా ఆయన విగ్రహం ఉంది . లోపలకి వెళ్ళగానే మంచి  సంగీతము వినపడి ఆ స్వరం వెతుక్కుంటూ మొదటి అంతస్థుకి వెళ్ళాను . అక్కడ శివుని విగ్రహం ముందు కూర్చుని ఒక యువకుడు పాడాడు . అప్పుడే పూర్తి అయ్యినట్లుంది . నేను వెళ్ళి బిస్మిల్ల ఖాన్ గారి ఇల్లు ఎక్కడ అని అడిగితే అడ్రెస్సు చెప్పాడు . ఆటో లో వెళ్ళండి అని కూడా. సలహా ఇచ్చాడు . 

  గుడి బయట పుస్తకాల షాప్ కనిపించగానే వెళ్ళడం దారిలో చదువుకోవడానికి ఒకటి తరువాత చదవడానికి రెండూ కొని తెలుగు డిపార్ట్మెంట్ కొసం బయలుదేరాము . ఎవరూ చెప్పలేకపోతే మాధవరావు గారికి ఫోన్ చేసాము . ఆయన సూచనలతో మెల్లగా చేరాము . బూదాటి వేంకటేశ్వరులు గారు HOD. వారిని , అక్కడ ఎన్నొ సంవత్సరాలుగా ఉన్న గుంటూర్ వాస్తవ్యులు భారతులశారద గారిని , కథానికలలో సరస్వతి గురించి పరిశొధన చేస్తున్న విద్యార్థిని కలిసాము . చల్లటి వారణాసి లస్సీ తాగించారు . ఆ చోట ఎంత మంది మహామహులు తెలుగు వారు చదువుకున్నారో గుర్తు చేసుకున్నాము . 1940-50 లలో ఆంధ్ర మహిళా సభ నుండి స్త్రీలకు మెట్రిక్ పరీక్ష రాయించడానికి మా పెద్ద మామగారు వచ్చేవారు . అప్పుడు స్కూల్ చదువు వరుసగా లేకుంటే బెనారస్ మెట్రిక్ రాయడమే . ఇక పద్మరాజు గారు , కొడవటిగంటి కుటుంబరావు గారు , మొదలైన వారు చదివిన ప్రదేశం . కబుర్లు , ఫొటొలు అయ్యాక దుర్గా దేవి గుడికి వెళ్ళాము . ఎర్రటి ఎండ . చెమటలు లేవు కాని శరీరం మాడ్చేసే ఎండ . ఆ గుడి చూపడానికి ప్రసాద్ గారి కోడలు స్నేహితులు వచ్చారు . పది నిమిషాలలో దర్శనం అయ్యింది . పొద్దున కాలభైరవుడి దగ్గర మిస్ అయ్యిన నెమలి పించం దెబ్బలు ఇక్కడ పూర్తి చేసాను . ఎదురుగానే త్రిదేవ్ మందిరం . అదీ అయ్యి మెల్లగా హోటల్ కి చేరాము . ఇక సాయంకాలం గంగా ఘాట్లు , ఆరతి . రేపు . 🙏

Tuesday, April 19, 2022

Emotions recollected in Tranquility-3

 పొద్దున్నే ఆరింటికి గుడి దగ్గరకు చేరాము . ఇదీ కాశి అంటే . ఇరుకు సందులు , అడుగడుకి ఒక గుడి , జనం , జనం . ఆరు కనుక బళ్ళు లేవు . అంటే ఊళ్ళో జనం లేరు . ఉన్నదల్లా మా లాంటి యాత్రికులు . ఇంతకీ మేము వెళ్ళింది కాలభైరవుడి గుడికి .

   కాశీ విశ్వనాధుని చూసే ముందు ఈ కాలభైరవుణ్ణి పర్మిషన్ అడగాలిట . ఆయన కాశీ కీ కోత్వాలు లాగ . నేను ప్రయాణం ప్లానింగ్ లో మా వియ్యపురాలు రాజేష్ రాణి ఖండూజా తో ఈ విషయం చెపితే ఆమె ' అయ్యో మాకు తెలియలేదు . కిందటి సంవత్సరం వెళ్ళాము కాని ఇది ఎవరూ చెప్ప లేదు ' అని వాళ్ళు ట్రిప్ ఏర్పాటు చేసినాయనకు ఫోన్ చేసి అడిగారట . ఆయన సిగ్గు బడుతూ ఒప్పుకుని ఈ సారి రండి ఏర్పాటు చేస్తాను అన్నారుట . ఆయనే మాకు ప్లాన్ చేసింది .

       కాల భైరవును గుడి చిన్న గుడి . అప్పటికే పెద్ద క్యూ . మేమూ పూల సజ్జ , అందులో ఒక ప్లాస్టిక్ కవరులో కొంచం నూనె పొసి ఇచ్చారు . అది దిష్టి లాగ తిప్పి ఇస్తారుట . మా చెప్పులు ఆ దుకాణం దగ్గర వదిలి క్యూ చివర వెతుక్కుంటూ వెళ్ళాము . అలా ఒక ఫర్లాంగ్ నడిస్తే దొరికింది . మేమూ అందులో చేరాము . అది ఒక అనుభవం . మా పక్క నుంచి మోటార్ సైకిళ్ళు , సైక్కిళ్ళు మనుష్యులని తప్పించుకుంటూ వెళ్తున్నాయి . అది ఒక మంచి అవకాశం అక్కడ ఇళ్ళు చూడాడానికి . అన్నీ పురాతనమైన కట్టడాలే . ఎదురెదురు మేడల బాల్కనీలు రోడ్ల పైన ఆర్చి లా ఉన్నాయి . ఇంటి ముందు అరుగులు . అందరివి తలుపులు వేసే ఉన్నాయి . మధ్యలో ఒక గుడి . అక్కడే ఒక పాత ఇల్లు పడగొట్టి కొత్తది కట్టుకునే ప్రయత్నం . అదో ప్రపంచం . 

  అన్ని గుళ్ళలో లాగానే వెనక ద్వారం ప్రవేశాలూ ఉన్నాయి . ముందు ఒక క్షణం విసుగు , కోపం వచ్చాయి . తరువాత నవ్వు వచ్చింది . నాకే ఆ అవకాశం వస్తే వెళ్ళనా ? ఇంకోకళ్ళకి వస్తే కోపం తెచ్చుకోవడం అవివేకం . సరే . అలా లోపల కి వెళ్ళి నా ముందు ఉన్న , నిమ్మి , ప్రసాద్ గారు డబ్బులు హుండీలో వేయబోతే ఆ గుడిలో ఉన్న పూజారి , నోటి నిండా పాన్ తో 'హూ ' అని హూంకరించి ఆ డబ్బులు తీసుకుని అందులోనే వేసాడు . కొత్త ప్రదేశం . అక్కడ రీతి తెలియదు . సరే నేను దణ్ణం పెట్టుకుని సజ్జ ఇస్తే అది దేవుడు దగ్గర బెట్టి మళ్ళీ వెనక్కి ఇచ్చారు . నూనె ఏమి ముట్టుకోలేదు . ఆ పక్కన ఒక కర్రకి నెమలి పించం కట్టుకుని వచ్చిన వాళ్ళని కొడుతున్నాడు . డబ్బులు అడుగుతున్నాడు . లైన్లో కుడి వేపు మేము , ఎడమ వేపు భార్గవి విడి పోయాము . తనకి ఈ కొట్టించుకోవడం వెనక కథ తెలుసుట . అందుకని తను కొట్టించుకుంది . మేము చెయ్య లేదు . 

    ఏమా కధ ? మనం చేసిన పాపాలకి కాలభైరవుడు ఆ నరకంలో కొరడాతో శిక్షిస్తాడుట . ఆ శిక్ష తప్పించుకోవాలి అంటే ఇక్కడ కొట్టించుకోవాలిట .

మనిషి మనస్సు ఎంత విచిత్రమైనదో కదా !! తప్పు అని తెలిసి చెయ్యడం . మళ్ళీ లోపల భయం మన మెదడుని తిననీకుండా ఒక solution వెతికేయడం . 

ఇంక బయటపడి గడియారం చూస్తే ఏడో , ఏడుంబావో అయ్యింది . పొద్దున్నే టీ నీళ్ళు నేను , కాఫి నీళ్ళు భార్గవి తాగి బయలుదేరాము కదా ఆత్మ రాముడు నేనున్నాను అని గొడవ మొదలు పెట్టాడు . ఇక్కడ అక్కడ ఎందుకు , మళ్ళీ హోటల్ కి వెళ్ళి breakfast చేద్దాము అని బయలుదేరాము . తరువాత అంతా పది తరువాతే ప్రయాణం అని . మళ్ళీ అంత దూరం ఎందుకూ అంటే -- రూం తో పాటు breakfast free 😁అందుకు .

మరి వెనక్కి వెళ్ళి కాస్త తిని ఒక అరగంట రెస్ట్ తీసుకుని ఇక ఊరి మీద పడ్డాము . ఈ లోపల దిలీప్ మమ్మల్ని గుడి బయట వదిలి మీరు వెళ్ళండి అనేసరికి మాకు అనుమానం మొదలైంది . ఇలా చేస్తే ఇంక విశేషాలు ఎలా తెలుస్తాయి అని . అప్పుడు ఈ ఊళ్ళో ఇంకా ఎవరు తెలుసు అనుకుని మొదలు పెడితే -- ప్రసాద్ గారి కోడలకి తెలిసిన వ్యక్తి , మా కంపెని రిప్రజెంటేటివ్ -- ఇలా గుర్తుకు వచ్చారు . ఇంతలో బండ్ల మాధవరావు గారి ఫోన్ . కాశీ లో ఉన్నారుటగా --BHU కి వెళ్ళండి అని . BHU మా ప్లాన్ లో ఉంది . తెలుగు విభాగానికి వెళ్ళమని సలహా ఇచ్చారు . సరే అనుకున్నాము . 

Emotions recollected in Tranquility-2

 Emotions recollected in tranquility -2 

కాశీ ప్రయాణం -౨

హైదరాబాద్ చేరగానే మళ్ళి బయటకు వచ్చి బాగేజ్ చెక్ ఇన్ చెయ్యవలసి వచ్చింది . టికెట్లు తేదీలు మార్చడం వల్ల తిప్పలు ..నిమ్మి పులిహోర , దద్దోజనం విడివిడిగా pack చేసి తెచ్చింది . ముందు gate no 28 కి చేరి తాపీగా తిన్నాము . ఒక అరగంటలో విమానం ఎక్కమని పిలుపు . ఇది కొంచం పెద్ద విమానం . గంటన్నర లో వారణాశి లో దింపాడు .

     ఏదో ఒక పుస్తకం లో కాశి దూరం నుంచి చూస్తే మండుతున్న  అగ్ని గోళం లా ఉందని రాసారు . ఎవరి కర్మ ప్రారబ్దం బట్టి వారికి కనపడుతుందేమో . మేము దిగే టప్పటికి సూర్యుడు అస్తమిస్తూ కాశీ మబ్బుల్లొ ఉన్నట్లు ఉంది . చూస్తూ దిగి విమానం బయటకు రాగానే అద్భుతమైన సూర్య  బింబం . ఫొటొ తీసాననుకున్నాను  . కాని లేదు .

    మా కోసం మా వియ్యంకులు ఏర్పాటు చేసిన driver cum guide ఎదురు చూస్తూ ఉన్నాడు . అతనే మా హోటల్ బుకింగ్ కి కూడా సాయ పడ్డాడుట . భార్గవికి వచ్చాము , hotel లో ఉండేందుకా గంగ దగ్గరకు వెళ్దాము అఅనిఆలొచన . దిలీప్ , మా driver cum guide ,,మీరు ఇవ్వాళ రెస్ట్ తీసుకొండి , రేపు పొద్దున్నే మీరు అడిగిన కాలభైరవుడితో మొదలు పెట్టి అన్నీ ఆరం సే చూపుతాను అని హామీ ఇచ్చాడు . 

    విమానాస్రయం నుండి పట్టణం కొంచం దూరం . అన్ని పట్టణాలు లాగానే ఉంది .

     కాని ఇది ఇలాంటి అలాంటి పట్టణమా ! కాశీ !

Mark Twain అన్నాడుట :" ఈ నగరం చరిత్ర కంటే పురాతనమైనది . సాంప్రదాయం కంటే పురాతనమైనది ,గాధలు కంటే పురాతనమైనది . వీటన్నిటి కలిపి రెండింతలు చేస్తే , దాని కన్నా పురాతనమైనది ". 

       మా హోటల్ అమాయా cantonment లో ఉంది . అది తరువాత పెరిగిన నగరం . విశాలంగా రోడ్లు , మాల్స్ , ఏ పట్టణమైనా కావచ్చు . అయితే ఒక శుభ వార్త . మోడి గారు రావటం లేదు . యోగి గారి ప్రమాణ స్వీకారం Lucknow లో . ఇద్దరికి మనస్సులో ధన్యవాదాలు చెప్పుకున్నాము . మర్నాడు పొద్దున్నే ఆరుగంటలకు దేవాలయం అని అనుకున్నాము .మేము రూం కి వచ్చి స్నానాలు చేసి , భోజనం ఆయేసరికి eనిమిదిన్నర . ఇంక పొద్దున్నే లేవాలి అని నిద్ర పొయాము . అలా కాశీ లో ఒక రాత్రి . మూడు రాత్రులైనా కాశీ లో  ఉండాలని శాస్త్రం .

  ఆ రాత్రి వీరభద్రుడి గారి ' నేను నడిచిన దారులు 'పుస్తకం చదువుతూ పడుకున్నాము . ఇది మర్నాటి మా ప్రయాణం ప్లాన్ చేసుకునేందుకు సహాయపడింది . వీరభద్రుడి గారికి కృతజ్ఞతలు

Emotions recollected in Tranquility

 Emotions recollected in tranquility!

నేను కవిత్వం రాయదల్చుకోలేదు . మా కాశీ ప్రయాణం భార్గవి బాగా రాసింది . నవలలో ఒక్కొ కారెక్టర్ వారి కథ చెప్తారు కదా ! అట్లాన్న మాట . ఇది కాశి ప్రయాణం నా మాటలలో .

  నాకు కాశి చూడాలని చాలారోజులు నుంచి కోరిక . ఒక్కర్తినే వెళ్ళాలి అంటే కొంచం అయిష్టం . హేమచంద్ర నో అనలేదు కాని కుదరలేదు . పైగా కాశి అనగానే కొంచం పూజ ,,వ్యవహారం ఉంటాయి కదా ! ( అంటే మనం అనుకుంటే) . దీనికి హేమచంద్ర అంత ఉత్సాహం చూపేవాడు కాదు .

   చివరికి నాకు భార్గవి తోడయ్యింది . సరే సరే అనుకున్నాము . ఆదివారం సరదాగ కలుద్దామని వచ్చిన ప్రసాద్ గారూ , నిమ్మి మేమో అన్నారు . అలా ఇద్దరం కాస్త నలుగురు అయ్యాము .

     ముందు హోళి పండుగ చూసుకోకుండా టికెట్లు బుక్ చేసాను ..మా వియ్యంకులు డెల్లి నివాసం . ఈ రోజుల్లో మీరు కాశి వెడితే హోటల్ రూం లో నాలుగు రోజులు ఉండి వెనక్కి వస్తారు . లోకల్స్ బయటకు వెళ్ళడానికి భయ పడతారు అనేసరికి ఒక వారం పొస్ట్పోన్ చేసాను ప్రయాణం . తడిసి మోపెడయ్యింది . తగ్గేదేలే అంటూ టిక్కెట్లు , హోటల్ బుకింగ్ అన్ని చేసాము . నా ముందు ఆలొచన ఘాట్స్ దగ్గర హోటల్ అని . దానికి రమా శాండిల్యా గారి సలహా కూడా తీసుకున్నాము . అంతలో మరో పిడుగు లాంటి వార్త ! అప్పుడే , ఆ తారెకుల్లోనే మోడి గారు , యోగి గారు విశ్వనాధ దర్శనం అనుకుంటున్నారని ! హత విధీ ! 

   సరే . ఒక నిర్ణయానికి వచ్చాను . ఘాట్ కి దూరంగా హోటల్ తీసుకుంటే , వీళ్ళు వస్తే ఆ రోజుల్లో చుట్టు పక్కల చూద్దాము , వాళ్ళు వెళ్ళాక విశ్వనాధ దర్శనం అనుకున్నాము . అలా నిర్ణయించుకుని మొదలు పెట్టామండి ప్రయాణం ! 

     ముందు ఏ ప్రయాణనానికైనా కావల్సింది ఏమిటి ? ఫొటొలు !!!ముందు విజయవాడ విమానాశ్రయం లో ఫొటొ ! ( కింద చూడుడు ) 

    నాకు కొంచం వయస్సు వచ్చాక ముందు వెళ్ళి స్టేషన్ లో కూర్చుందామని ఫీలింగ్ . అలాగే ముందు వెళ్ళాము ..విజయవాడ నుండి హైదరాబాద్ . అక్కడ ఓ రరెండుగంటల తరువాత హైదరాబద్ నుండి వారణాసి . 

    ఊరుకునే కూర్చుంటే ఎలా అని అక్కడున్న షాపులు చూసాను ..నేను కాలేజిలో చదివటప్పుడు ఇలాంటి earrings మా స్నేహితురాలికి వుండేది . అపుడే నాకు చాల నచ్చింది . అదేమో బంగారం . ఇది కాదు . పైగా pretty woman అఅంటొది షాప్ పైన బోర్డ్ . నా వయస్సు మర్చి పోయి హాయిగా వెళ్ళి కకొనుక్కుని. ఫోటో తీసుకున్నాను ..ఫొటొ వయస్సు చెప్పేసింది . అయితే ఏమిటట ? 

    అలా చిన్న డకోటా లాంటి విమానం ఎక్కాము . అలాంటి విమనాలు మనకి షాపులో దొరుకుతాయి . ఎటొచ్చి ఎగరవు అంతే . ఇంతోటి హైదరబాదు కి ఇది చాల్లే అఅని నిర్ణయించాడు Indigo . eఎదుట్ సీట్లో పిల్లవాడు -- అన్నిటికి ఆశ్చర్య పోతూ ఉంటే కాసేపు బాగుంది . కాని ఆ పిల్లాడి తాత airplane security measures card తీసి కూతురికి ఇచ్చి బాగ్ లో పెట్టు అంటే నవ్వేసాము . అలా నవ్వ కూడదు . అయినా ఆగలేదు . ఇలా చేరామండి హైదరాబాదు . మళ్ళీ రేపు ( భార్గవి తో కూడా ఒక ఫోటో ఉండాలి )

Emotions recollected in tranquility!

నేను కవిత్వం రాయదల్చుకోలేదు . మా కాశీ ప్రయాణం భార్గవి బాగా రాసింది . నవలలో ఒక్కొ కారెక్టర్ వారి కథ చెప్తారు కదా ! అట్లాన్న మాట . ఇది కాశి ప్రయాణం నా మాటలలో .

  నాకు కాశి చూడాలని చాలారోజులు నుంచి కోరిక . ఒక్కర్తినే వెళ్ళాలి అంటే కొంచం అయిష్టం . హేమచంద్ర నో అనలేదు కాని కుదరలేదు . పైగా కాశి అనగానే కొంచం పూజ ,,వ్యవహారం ఉంటాయి కదా ! ( అంటే మనం అనుకుంటే) . దీనికి హేమచంద్ర అంత ఉత్సాహం చూపేవాడు కాదు .

   చివరికి నాకు భార్గవి తోడయ్యింది . సరే సరే అనుకున్నాము . ఆదివారం సరదాగ కలుద్దామని వచ్చిన ప్రసాద్ గారూ , నిమ్మి మేమో అన్నారు . అలా ఇద్దరం కాస్త నలుగురు అయ్యాము .

     ముందు హోళి పండుగ చూసుకోకుండా టికెట్లు బుక్ చేసాను ..మా వియ్యంకులు డెల్లి నివాసం . ఈ రోజుల్లో మీరు కాశి వెడితే హోటల్ రూం లో నాలుగు రోజులు ఉండి వెనక్కి వస్తారు . లోకల్స్ బయటకు వెళ్ళడానికి భయ పడతారు అనేసరికి ఒక వారం పొస్ట్పోన్ చేసాను ప్రయాణం . తడిసి మోపెడయ్యింది . తగ్గేదేలే అంటూ టిక్కెట్లు , హోటల్ బుకింగ్ అన్ని చేసాము . నా ముందు ఆలొచన ఘాట్స్ దగ్గర హోటల్ అని . దానికి రమా శాండిల్యా గారి సలహా కూడా తీసుకున్నాము . అంతలో మరో పిడుగు లాంటి వార్త ! అప్పుడే , ఆ తారెకుల్లోనే మోడి గారు , యోగి గారు విశ్వనాధ దర్శనం అనుకుంటున్నారని ! హత విధీ ! 

   సరే . ఒక నిర్ణయానికి వచ్చాను . ఘాట్ కి దూరంగా హోటల్ తీసుకుంటే , వీళ్ళు వస్తే ఆ రోజుల్లో చుట్టు పక్కల చూద్దాము , వాళ్ళు వెళ్ళాక విశ్వనాధ దర్శనం అనుకున్నాము . అలా నిర్ణయించుకుని మొదలు పెట్టామండి ప్రయాణం ! 

     ముందు ఏ ప్రయాణనానికైనా కావల్సింది ఏమిటి ? ఫొటొలు !!!ముందు విజయవాడ విమానాశ్రయం లో ఫొటొ 

    నాకు కొంచం వయస్సు వచ్చాక ముందు వెళ్ళి స్టేషన్ లో కూర్చుందామని ఫీలింగ్ . అలాగే ముందు వెళ్ళాము ..విజయవాడ నుండి హైదరాబాద్ . అక్కడ ఓ రరెండుగంటల తరువాత హైదరాబద్ నుండి వారణాసి . 

    ఊరుకునే కూర్చుంటే ఎలా అని అక్కడున్న షాపులు చూసాను ..నేను కాలేజిలో చదివటప్పుడు ఇలాంటి earrings మా స్నేహితురాలికి వుండేది . అపుడే నాకు చాల నచ్చింది . అదేమో బంగారం . ఇది కాదు . పైగా pretty woman అఅంటొది షాప్ పైన బోర్డ్ . నా వయస్సు మర్చి పోయి హాయిగా వెళ్ళి కకొనుక్కుని. ఫోటో తీసుకున్నాను ..ఫొటొ వయస్సు చెప్పేసింది . అయితే ఏమిటట ? 

    అలా చిన్న డకోటా లాంటి విమానం ఎక్కాము . అలాంటి విమనాలు మనకి షాపులో దొరుకుతాయి . ఎటొచ్చి ఎగరవు అంతే . ఇంతోటి హైదరబాదు కి ఇది చాల్లే అఅని నిర్ణయించాడు Indigo . ఎదుట  సీట్లో పిల్లవాడు -- అన్నిటికి ఆశ్చర్య పోతూ ఉంటే కాసేపు బాగుంది . కాని ఆ పిల్లాడి తాత airplane security measures card తీసి కూతురికి ఇచ్చి బాగ్ లో పెట్టు అంటే నవ్వేసాము . అలా నవ్వ కూడదు . అయినా ఆగలేదు . ఇలా చేరామండి హైదరాబాదు . మళ్ళీ రేపు .



Tuesday, January 18, 2022

సమాంతరాలు

 కథ చదివినప్పుడు ఆనంద పడడం, ఉత్సాహ పడడం , ఏక్జ్ యిట్ అవడం అనేది చాలా తక్కువ సార్లు అవుతుంది . తల్లావఝుల పతంజలి శాస్త్రి గారి కొత్త కథల పుస్తకం 'సమాంతరాలు ' అలా ఫీల్ అయ్యాను . 

ఇప్పటి దాకా చదివింది రెండు కథలు - సమాంతరాలు , మార్కండేయులు కాఫీ . సమాంతరాలు మనిషి లోని స్వభావం , మానసిక పరిస్థితి ఎంత స్పష్టంగా చిత్రీకరించారు . 

మొదటి కథ సమాంతరాలు . ఒక రిటైర్డ్ ఉద్యోగి ఒంటరి జీవితం లోకి దొంగ ప్రవేశించాడు . వాడు కన్న కొడుకు కంటే ఎక్కువ అవుతాడు . కొడుకుల ఒత్తిడి నుంచి తప్పించుకోవడానికి చని పోదామని నిర్ణయించు కుంటాడు . దానికి ఈ దొంగ సాయం అడుగుతాడు . కొడుకులలో లేని మానవత్వం ఈ దొంగలో ఉంటుంది . ఆయనని చంపడానికి ఒప్పుకోడు . 

అల్లా అని అతనికి డబ్బు   అవసరం లేక  కాదు . ఆ అవసరం కోసం ఆయన సంతకం ఫోర్జ్ చేసి బాంక్ నుంచి తీసుకోవాలి అని అనుకుంటున్నాడు. ఆ అవసరం లేకుండానే ఆయన చని పోతూ అతనకి డబ్బులిస్తాడు . 

ఇందులో ఎవరు తన వారు, ఎవరు పరాయి వారు తెలియని మానవ సంబంధాలు గురించి మన ముందు ఉంచారు . 

ఇక రెండో కథ రెండు వాక్యాలు మన మూడు ఎప్పుడూ కదులుతాయి . 'మార్కండేయులు తను ఎలా ఉండాలనుకున్నాడో  అలా ఉన్నాడు  . పూర్ణ  తాను ఎలా ఉండకూడదు  అనుకుందో అలా ఉంది '. 

మార్కండే యులు లా జనాపకాలలో జీవిస్తారా/ అంటే జీవిస్తారు . వారికి వర్తమానం త సంబంధ లేదు . ఎప్పుడు గతం లో ఉంటారు . అలా ఉండే మార్కండేయులు , వర్తమానం లో ఉండే పూర్ణ కి కుదరదు . కాని మార్కండేయులు పూర్ణ ని ప్రేమస్తాడు ఒక అ జనాపకం లా . దాన్ని వదలలేడు. పూర్ణ అతనిని పూర్తిగా మర్చి పోయి జీవితం కోన సాగించలేదు. 

రెండు కథలు మనల్ని అంత   తొందరగా వదలవు. నాలుగు పా మన మధ్యలో ఉంటారు . రాచాయి అన్నతళు జీవితం లో బుద్ధి ప్రమేయం ఉండదు . ఇది ఒక సాలె గూడు లా అల్లుకుంటూ పోతుంది. తరువాత దారం ఎటునుంచి ఎటు పోతుందో మనం ముందు ఊహిస్తే అది జీవితమే కాదు . పతంజలి శాస్త్రి గారికి నమస్కారాలు.