యాత్ర స్పెషల్ - 12
ఇక యాత్ర చివరికి వచ్చేసాము. కిందకి దిగుతున్న కొద్ది మళ్ళీ నా ఆరోగ్యం వచ్చేసింది . మాములుగా నడుస్తున్నాను. చలి తగ్గింది. Monal లో మళ్ళీ a.c. వేసుకున్నాము. పొద్దున మాములుగా లేచాము .
బయలుదేరి హరిద్వార్ కి ప్రయాణం.
దారిలో చూసిందింతా కొండల విధ్వంసం . కరెంటు కోసమో , డామ్ల కోసమో , సిమెంటు కొసమో కొండలు తొలిచేస్తున్నారు. దుమ్ము , ధూళి. గంగ నిండా slush. ఆ దుమ్ముకి నాకు కూడా తుమ్ములు . మందు రెడీగా పెట్టుకున్నాము కనుక ఎక్కువ ఇబ్బంది పడలేదు. నాకెందుకో డైనమైట్ తో ఆటలాడుకుంటున్నామని అనిపించింది .
దారిలో ఋషికేశ్ లో ఆగాం. స్వామి శివానందగారి ఆశ్రమం , లక్ష్మణ ఝూలా చూడాలని. శివానంద ఆశ్రమం ఇప్పటిదా?! ఆయన పుస్తకాలు చదివి చదువు మధ్యలో వదిలేసి ఆశ్రమానికి వెళ్ళిన వారిలో నండూరి రామ్మోహనరావు గారు ఒకరు. ఇంట్లో వాళ్ళు పరుగున స్వామిజీ దగ్గరకు వెళ్ళి సంగతి చెపితే ఆయన మందలించి వెనుకకు పంపిచారుట.అప్పటికే ఆయనకు పెళ్ళయింది. ఆ తరువాత ఆయన పెండ్యూలం రెండో వైపు వెళ్ళింది . సైన్స్, నాస్తికత్వం ఆయనను ఆకట్టుకున్నాయి. చివరి దాకా అదే పంథాలో ఉండిపోయారు .
ఎప్పటి నుంచో ఈ ఆశ్రమం చూడాలని. ప్రశాంతంగా వుంది. అక్కడ ఓ రెండు పుస్తకాలు కొని ఆయన సమాధి చూసాము. అక్కడ నుంచి దిగితే లక్ష్మణ ఝూల. ఎన్ని మెట్లు అని అడిగితే వంద అన్నారు. దిగుతా కాని మళ్ళీ పైకి రాలేను. అక్కడే వదిలేసే లెక్కనయితే ఓ కే అంటే స్వామిజీ ' ఇక్కడే వుండు లే' అన్నాడు. ఆ ఆశ్రమం పరిసరాలు గమనించుకుంటూ అక్కడే వున్నాము. మా చెల్లెలు కూడా వెళ్ళలేదు. అసలుది అయిపోయాయి , ఈ కొసర్ల ఏముంది ?!
రిషికేశ్ లో bungy jumping - highest in India - అని వుంది . rafting బాగా encourage చేస్తున్నారు . ఓ పది రాఫ్ట్ పడవలు చూసాం . వయసులోనే ఈ సరదాలూ, adventure లు . అప్పుడు చెయ్యక పోతే ఇక అంతే . మనిషి లోని అంతర్గత శక్తికి ఇవి పరీక్షలు .
దారిలో భోజనం చేసి సాయంకాలానికి హరిద్వార్ చేరాము . ఇక రేపు పొద్దున్నే డిల్లి . ఆ మర్నాడు విజయవాడ .
ప్రయాణం చివరి దశకు చేరింది . ఈ ప్రయాణం లో నేను నేర్చుకున్నది తో ఈ పరంపర ముగిస్తాను .




No comments:
Post a Comment