యాత్రా స్పెషల్ - ఆఖరిది .
ఈ కథ పూర్తి చేసే ముందు మర్చిపోయిన కొన్ని విశేషాలు .
బదరీ బౌధ్ధ కేంద్రం . ఆ కట్టడం చూస్తే అర్థం అయ్యిపోతుంది . శంకరాచార్యులు వారు వారిని వాదం లో ఓడించి ఆ కేంద్రం బదరీ దేవాలయం గా మార్చారుట . లోపల విగ్రహం కాదు . స్వామి వారి కి అక్కడ దొరికిన సాలిగ్రామం . దానికి ఒక వైపు కుబేరుడు , గరుడుడు , ఉత్సవ విగ్రహం ఉద్ధవ్ , ఆ పక్కన నారదుడు , రెండొ వైపు నరుడు , నారయణుడు . బయట రెండు కొండలు కూడా నరుడు నారాయణుడు - తపస్సులో ఉన్నట్లు . కొండలకు పేర్లేమిటి ? మనుషులకు మాత్రం ఎందుకు ? A kind of owning up..
ఇక నేను నేర్చుకున్నది -- యాత్రలలో సహనం వుండాలి . అందులో అంత మంది వున్నప్పుడు అవతల వారిని అర్ధం చేసుకుంటూ పోవాలి .
౨. దొరికిన దానిలో నచ్చింది తినేయాలి . మితం గా తింటే మంచిది
3. ఇక్కడ నేను ఏమి చూసాను , నేర్చుకున్నాను -- అంటే ఇంకా process జరుగుతోంది . ఒకటి మాత్రం అర్థం అయ్యింది . అక్కడ గుడి కాదు ముఖ్యం ప్రయాణం ముఖ్యం .
4. దానితో పాటు పర్యావరణ స్పృహ ఉండాలి .
5. ఇబ్బందులు ఉంటాయి . నీ శక్తి నువ్వే గ్రహించుకుని ముందుకు వెళ్ళాలి . ఎక్కువ వద్దు , తక్కువా వద్దు .
ప్రతి విషయం లో మంచి , చెడు రెండూ ఉంటాయి ఏది ఎక్కువ ఆలోచిస్తావనేది నీ మీద ఆధారపడి ఉంటుంది
6. యాత్ర విడవిడిగా చేస్తే ఖర్చు ఎక్కుువైనా నిదానంగా అన్నీ చూడచ్చు


No comments:
Post a Comment